telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టులో రాహుల్ కు ఊరట.. పరువు నష్టం దావా కేసు కొట్టివేత!

rahul gandhi to ap on 31st

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడే దొంగ) అంటూ చేసిన విమర్శలపై సుప్రీంకోర్టులో కోర్టు లో పరువు నష్టం దావా పిటిషన్ లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్ గాంధీపై దాఖలైన ఈ పిటిషను కొట్టేసింది.రాహుల్ గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

భవిష్యత్ లో సంయమనం పాటించాలని ఆయనను సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్ లు కొట్టి వేయడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాల్లో పదే పదే ‘కాపలాదారుడే దొంగ’ అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే తాను దేశ ప్రధానిగా కాకుండా దేశ కాపలాదారుడిగా ఉంటానని 2014 లోక్ సభ ఎన్నికల ముందు మోదీ అన్నారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఇటువంటి విమర్శలు చేశారు.

Related posts