telugu navyamedia
రాజకీయ వార్తలు

2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి!

Supreme Court

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని స్థలంపై తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ‘2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని చెప్పింది. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది.

ప్రధానమైన డోమ్ కింద రాముడి జన్మస్థానం అని నమ్ముతారని వ్యాఖ్యానించింది. వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు..ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తుదితీర్పులో స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. వివాదాస్పద స్థలంపై హక్కులు, మత సామరస్యం, శాంతి భద్రతలకు లోబడి ఉంటాయని పేర్కొంది.

Related posts