ఫిబ్రవరి 11న చెన్నైలోని లీలా ప్యాలెస్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతో ప్రముఖ బిజినెస్మెన్ విశాగన్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సౌందర్య, విశాగన్ లకి ఇదివరికే వివాహం కాగా, వారిరివురు ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. విశాగన్ ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు. ఇక సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్కుమార్ను సౌందర్య పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. సౌందర్యకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొచ్చియాడన్, వీఐపీ 2 చిత్రాలకు ఆమె డైరక్టర్గా పని చేశారు. కాగా… ఈ జంట ఇటీవల చెన్నై నుండి లండన్ వెళ్ళేందుకు టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు లండన్లోని హెర్బ్యూ ఎయిర్ పోర్ట్కి చేరుకోగా, ఇమ్మిగ్రేషన్ సమయంలో విశాగణ్ తన పాస్ పోర్ట్తో పాటు అమెరికన్ డాలర్స్తో కూడిన సూట్కేసు మిస్ అయిన విషయాన్ని గ్రహించాడు. విశాగన్ వెంటనే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే భారత రాయబార కార్యాలయం కూడా వెంటనే స్పందించి విశాగన్ కోసం డూప్లికేట్ పాస్ పోర్ట్ జారీ చేసినట్టు సమాచారం.