లాక్ డౌన్ సమయంలో చాలా మంది సెలెబ్రిటీలు కూరగాయలు పండ్లతోటలను పెంచుతూ సమయాన్ని గడిపారు. అలాగే సూపర్స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల కూడా చాలారోజులుగా ఇంటి ఆవరణలోనే తోట పెంచుతున్నారు. వంటకు అవసరమైన కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి సాంప్రదాయ పద్ధతిలో పండిస్తున్నారు. ఆ వీడియోను మంజుల తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. `ఇది నా కిచెన్ గార్డెన్. ఫలాలతోనూ, కూరగాయలతోనూ, సంతోషంతోనూ నిండిపోయింది` అంటూ ఆ వీడియోను పంచుకున్నారు. కరోనా ఎంతో మందికి జ్ఞానోదయం కలిగించిందని, అందరూ స్వయంగా పండించుకోవడంపై దృష్టి సారించాలని మంజుల పేర్కొన్నారు.
previous post