telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : రాజస్థాన్ పై హైదరాబాద్ ఘన విజయం…

ఐపీఎల్ 2020లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ ను బాగానే కట్టడి చేసారు. ఐపీఎల్ 2020 లో మొదటి మ్యాచ్ ఆడుతున్న జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీసాడు. అయిన రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ సంజు సామ్సన్ (36), బెన్ స్టోక్స్(30) రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది ఆ జట్టు. ఇక 155 పరుగులలక్ష్యంతో బరిలోకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లను మొదటి మూడు ఓవర్లలోనే పెవిలియన్ కు పంపి రాయల్స్ బౌలర్లు షాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మనీష్ పాండే, విజయ్ శంకర్ అద్భుతంగా షాట్స్ ఆడారు. మనీష్ 47 బంతుల్లో 8 సిక్స్లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేయగా శంకర్ 6 ఫోర్లు సహాయంతో 51 బంతుల్లో 52 పరుగులు చేసాడు. దాంతో మరో వికెట్ పడకుండా హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో 18.1 ఓవర్లలోనే రాయల్స్ పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో 5 వ స్థానానికి వెళ్లడం మాత్రమే కాకుండా తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటే ఈ ఓటమితో ప్లే ఆఫ్ నుండి రాజస్థాన్ ఔట్ అయింది.

Related posts