telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : పంజాబ్ కు షాక్ ఇచ్చిన సన్‌రైజర్స్…

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ లో 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ను కొంచెం వేగంగా ప్రారంభించిన పవర్ ప్లే తర్వాత స్లో చేసారు. కెప్టెన్ వార్నర్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్న విలియమ్సన్ తో కలిసి అర్ధశతకం పూర్తి చేసుకున్న బెయిర్‌స్టో జట్టుకు 18.4 ఓవర్లలో విజయాన్ని అందించాడు. అయితే పంజాబ్ పైన 9 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ కు ఈ సీజన్ లో ఇదే మొదటి విజయం.

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు సన్‌రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస వికెట్లు తీస్తూ ఆ జట్టును 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆల్ ఔట్ చేసారు.

Related posts