telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్‌ లో కరోనా విలయం .. మరో నటుడికి పాజిటివ్‌

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు. తాజాగా… బాలీవుడ్‌ ప్రముఖ సినీనటుడు, గురుదాస్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ కరోనా బారిన పడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉంటున్న సన్నీ డియోల్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని హిమాచల్‌ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్‌ అవస్థీ చెప్పారు. ఎంపీ సన్నీడియోల్‌, అతని స్నేహితులు కుల్లూ జిల్లా నుంచి ముంబైకి వెళ్లాలనుకున్నారు. కానీ సన్నీడియోల్‌ కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్‌ అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు. దీంతో ఆయన ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటున్నారు.

Related posts