బాలీవుడ్ నటుడు సన్నీడియోల్, నటి హేమామాలిని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీనియర్ నటుడు ధర్మేంద్ర తనయుడు సన్నీడియోల్ పంజాబ్లోని గురుదాస్ పూర్ నుంచి, హేమామాలిని యూపీలోని మథుర నుంచి పోటీ చేశారు. వీరిద్దరూ అత్యధిక మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలు. అయినప్పటికీ పార్లమెంటులో ఒక చోట కూర్చోలేరు. ఎందుకంటే… నిజానికి హేమామాలిని సీనియర్ ఎంపీ. సన్నీడియోల్ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అందుకే హేమామాలిని పార్లమెంటులోని ముందు వరుసలో కూర్చుంటారు. కొత్త ఎంపీ అయినందున సన్నీడియోల్ వెనుక వరుస సీట్లలో కూర్చోనున్నారు. కాగా సన్నీడియోల్ విజయం సాధించిన సీటు నుంచి గతంలో బీజేపీ గెలుస్తూ వస్తోంది. గతంలో ఈ సీటు నుంచి దివంగత నటుడు వినోద్ఖన్నా పోటీచేసి విజయం సాధించారు. ఈ సారి ఈ సీటు టిక్కెట్ను సన్నీడియోల్కు బీజేపీ కేటాయించింది. సన్నీ డియోల్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
previous post