ఇటీవల కాలంలో బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రజనీకాంత్ గత రెండు చిత్రాల్లో బాలీవుడ్ నటులే రజనీకాంత్ విలన్స్గా నటిస్తున్నారు. రజనీకాంత్ “కాలా”లో నానా పటేకర్ విలన్గా నటిస్తే, ఈ ఏడాది విడుదలైన `”పేట”లో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా నటించాడు. తాజాగా రజనీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “దర్బార్”. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నయనతార, నివేదా థామస్, దలీప్ తాహిల్, ప్రతీక్ బబ్బర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ముంబై షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ను 29 నుండి ప్రారంభించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి “దర్భార్”: చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్