కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ నిర్వహించి, తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇరు దేశాలు పంచుకోవడం మంచిదని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్న మాటలపై.. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మండిపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ విష్యం పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. షోయబ్ అక్తర్ వ్యాఖ్యలను లిటిల్ మాస్టర్ తప్పుబట్టాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్కు ఇది సమయం కాదన్నాడు.
ఇండో, పాక్ సిరీస్ నిర్వహించడం ద్వారా భారత్కు డబ్బు అవసరం లేదని.. ఇప్పటికే బీసీసీఐ రూ. 51 కోట్ల ఆర్థిక సాయం చేసిందని.. ఒకవేళ ఇంకా అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. పాక్తో క్రికెట్ ఆడేందుకు కాదని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అయితే అక్తర్ ప్రతిపాదనకు వంతపాడిన పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది కపిల్ నుంచి ఇలాంటి ప్రతిస్పందన ఊహించలేదని పేర్కొన్నాడు. తాజాగా సునీల్ గవాస్కర్ కూడా పాక్తో సిరీస్కు ఇది సమయం కాదని అన్నాడు.
ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు: మంత్రి అనిల్