టాలీవుడ్ లో యువ హీరో సందీప్ కిషన్ తమిళ, తెలుగు బాషలలో పలు చిత్రాలలో నటిస్తున్నప్పటికీ, ఆ చిత్రాలు మంచి విజయాన్ని తెచ్చిపెట్టపోవడం తో కొంత నిరుత్సహాంగానే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కిషన్ కు, రెజీనా కు మధ్య ఏదో ఉందంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. దీనిపై సందీప్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. రెజీనాకి, సందీప్కి మధ్య ఎఫైర్ నడుస్తుందని కొన్నాళ్ళుగా ప్రచారం నడుస్తుండగా, దానిపై క్లారిటీ ఇచ్చాడు. మీరందరు అనుకున్నట్టు రెజీనా, నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని పేర్కొన్నాడు సందీప్ కిషన్.
ప్రస్తుతం నిను వీడని నేను అనే చిత్రంలో నటిస్తున్నాడు సందీప్. కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్యా సింగ్ కథానాయికగా నటిస్తుంది. అతి త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తగిన ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన ప్రేమాయణం గురించి తెలిపాడు సందీప్. రెండేళ్ళ క్రితం వరకు ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్న తాను ప్రస్తుతం సింగిల్గా ఉన్నట్టు తెలిపాడు. ఆ అమ్మాయి ఎవరనేది చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఆమె తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. పేరు చెప్పి ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని సందీప్ పేర్కొన్నాడు.