హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి ఉచిత కంప్యూటర్ వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సింగారి రాజ్ కుమార్ తెలిపారు. ఈ శిక్షణ గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థలో పొందిన ఎందరో నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు.
పదోతరగతి కనీస అర్హత కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, గృహిణులు కోసం గత 15 సంవత్సరాలుగా ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ వేసవిలో కూడా ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఎంఎస్ ఆఫీస్, ఎంసెట్ రాసిన వారి కోసం సీ లాంగ్వేజ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామన్నారు. అర్హులైన వారు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని సందర్శించాలని, ఇతర వివరాలకు 9866661588 నంబరులో సంప్రదించాలన్నారు.
ఆర్బీఐని కొల్లగొట్టినంత మాత్రాన.. ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో పెట్టలేరు: రాహుల్