telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కివీస్ మ్యాచ్ రద్దు.. టికెట్ డబ్బులు ఇవ్వండి : సుమంత్

Sumanth

టాలీవుడ్ హీరో సుమంత్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే… ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్- న్యూజిలాండ్ మ్యాచ్ వ‌ర్షం వ‌ల‌న ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానాన్ని వరుణుడు వదలకపోవడంతో ఒక్క బాల్ ప‌డ‌కుండానే మ్యాచ్ రద్దైంది. అయితే ఆ మ్యాచ్ కోసం టిక్కెట్స్ కొనుకున్న క్రికెట్ అభిమానుల‌కి ఐసీసీ టికెట్ డ‌బ్బులు తిరిగిస్తామ‌ని అప్ప‌ట్లో హామీ ఇచ్చింది. కాని ఇంత వ‌ర‌కు ఆ మ్యాచ్ డ‌బ్బులు రిఫండ్ కాక‌పోవ‌డంతో టాలీవుడ్ న‌టుడు సుమంత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. నెల‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికి ఇంత వ‌ర‌కు టిక్కెట్ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డం దారుణం. ఈ స‌మ‌స్య‌పై త్వ‌ర‌గా స్పందించడ‌ని ఆయ‌న కోరాడు. జూన్ 13న భార‌త్‌- న్యూజిలాండ్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కుర‌వ‌డం వ‌ల‌న మ్యాచ్ ర‌ద్దైన సంగతి తెలిసిందే.

Related posts