ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు యాంకర్ సుమ ఓ వీడియో విడుదల చేసింది. ‘వైరస్ కలకలం రేపుతున్న ఈ తరుణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తలు చెబుదామని వచ్చానని తెలిపింది.
‘జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం జీర్ణకోశ సమస్యలు ఉంటే కచ్చితంగా కరోనా వైరస్ ఉన్నట్లు కాదు. కాకపోతే వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. మన భారతీయ సంస్కృతి విధానంలో ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెడతాం. ఎవరైనా ఇంటికి వస్తే కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తాం’ అని తెలిపింది. వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. శుభ్రతే వైరస్కు చక్కటి మందు అని సుమ వ్యాఖ్యానించింది.
గాంధీల కుటుంబాలపై విమర్శలు చేయకుడదా ..?