telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బార్డర్‌లో సైనికుడి గెటప్‌లో ఫైటర్‌…!

Vijay-Devarakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నూతన సినిమాను పూరీతో చేస్తున్న విషయం తెలిసిందే. అందులో యాక్షన్ సీక్వెన్స్‌లను జోడించి మంచి ఫైటింగ్ సినిమాను తెరకెక్కించనున్నారు. దానితో పాటుగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఇందులో విజయ్ సరసన్ అనన్య పాండె కనిపించనుంది. అయిత విజయ్ ఇటీవల తన తరువాత ప్రాజెక్ట్ గురించి తెలిపి అందరిని షాక్‌కు గురిచేశాడు. తన తరవాతి సినిమాను రంగస్థలం దర్శకుడు సుకుమార్‌తో చేయనున్నట్లు తెలిపాడు. దీంతో రౌడీ అభిమానులు తెగ ఆనందపడ్డారు. అయితే ఈ సినిమా భారత్, పాకీస్తాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని సైనికుడిగా కనిపించనున్నాడని టాక్ వస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా విజయ్ స్నేహితుడు కేదర్ సెలగంశెట్టి టాలీవుడ్‌లోకి నిర్మాతగా అరంగేట్రం చేయనున్నాడు. అతడి బ్యానర్ ఫాల్కన్ క్రియేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇప్పటికే కేదర్ దర్శకుడు సుకుమార్ పారితోషికంలో భాగంగా పది కోట్లు ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లాభాల్లో సుకుమార్‌కూ షేర్ ఉంటుందని కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథపై అధకారిక సమాచారం కోసం మరికొంత సమయం ఆగాల్సిందే.

Related posts