హైదరాబాద్లో ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాగి కార్తీక్ అనే యువకుడు నగరంలోని అంజయనగర్లో గల ఓ హాస్టల్లో ఉంటూ టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్నాడు. టీసీఎస్ గచ్చిబౌలి క్యాంపస్లో ఆరు నెలల క్రితమే చేరాడు. నిన్న కార్తీక్తో పాటు ఉండే మరో నలుగురు ఉద్యోగానికి వెళ్లగా తను మాత్రం వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉన్నాడు.
స్నేహితులు రాత్రి 10 గంటలకు హాస్టల్ కు తిరిగివచ్చి చూసేసరికి గదిలోపలి నుంచి లాక్ చేసి ఉంది. తలుపు పగులగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్కు వ్రేలాడుతూ కనిపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.