telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పలాస’ దర్శకుడికి సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్

Sudheer-Babu

యంగ్ హీరో సుధీర్ బాబు, దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం బార్డర్ ‘పలాస’ నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించాడు కరుణ కుమార్. ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. తాజాగా సుధీర్ బాబు సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ . రేపు (30న ) సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు ‘పలాస’ డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఇక సుధీర్ బాబు ఇటీవల వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Related posts