telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

సెలవు కోసం .. విద్యార్థుల ఘాతుకం.. తోటివిద్యార్థిని పై దాడి…

New couples attack SR Nagar

హింసాప్రవృత్తి పాఠశాల వరకు వెళ్లిపోయిందని ఈ ఘటన సుస్పష్టంగా తెలియజేస్తుంది. పాఠశాలకు సెలవుల కోసం తోటి విద్యార్థినిని హత్య చేసేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించడం సంచలనమైంది. జిల్లాలోని చెన్నూరులో ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ముగ్గురు సెలవుల కోసం వక్ర బుద్ధితో ఆలోచించారు. ఎవరైనా విద్యార్థినిని చంపేస్తే స్కూలుకు సెలవులు వస్తాయని భావించారు.

ఇందుకోసం రమాదేవి అనే స్నేహితురాలిని ఎంచుకున్నారు. ముగ్గురూ కలిసి ప్లాన్ అమలు చేసే క్రమంలో రమాదేవి గట్టిగా కేకలు వేసింది. దీంతో విద్యార్థినులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విద్యార్థినులను పట్టుకుని మందలించి ఇంటికి పంపారు.

Related posts