telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

అమెరికాలో అరెస్ట్ అయిన భారత విద్యార్థులు.. తప్పు మీదే అంటున్న అధికారులు..

indian embassy 24 hrs help line for arrested in usa

భారత విద్యార్థుల అరెస్టుపై అమెరికా ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం(డెమార్ష్‌) జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో బోధనా వ్యవస్థ లేదన్న విషయం కూడా వారికి తెలుసు. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు.. అని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించాలని కోరింది. దళారులను, విద్యార్థులను ఒకేలాగా చూడొద్దని విజ్ఞప్తి చేసింది. వీలైనంత త్వరగా వారిని విడుదల చేయాలని కోరింది. విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని తెలిపింది. అలాగే భారత రాయబార కార్యాలయంలో 24గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం నకిలీదని భారత విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి వివరించారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిని పట్టుకోవాలని భావించి ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. అందులో భాగంగా 8 మంది దళారులను, వారి ద్వారా చేరిన 130 మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్మింగ్‌టన్‌ వర్సిటీ మాత్రం జాతీయ గుర్తింపు ఉందని, ఆన్‌లైన్‌ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రకటించుకోవడం గమనార్హం. ఒకసారి వారు తిరిగొస్తే మళ్లీ వీసా లభించడం అసాధ్యమని నిపుణుల అంటున్నారు. దీనితో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts