రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి బీ-ఫార్మసీ చదువుతున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనతో హాస్టల్లో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. హాస్టల్లో నివాసముంటున్న సహా విద్యార్థులు ఈ సంఘటన చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
హాస్టల్ యాజమాన్యం విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య పై ఆరా తీసుస్తున్నారు. ఈ విషయం హాస్టల్ యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు తెలియపరిచింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాథూరాం గాడ్సేను మహాత్ముడని పిలవాలా?: ఒవైసీ