హైదరాబాద్ ఐఐటీలో ఉరేసుకొని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉత్తరపప్రదేశ్లోని వారణాసికి చెందిన మార్క్ ఆండ్రూ చార్లెస్ సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీలో ఎం డిజైన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నేడు చార్లెస్ అకస్మాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్రకలకం రేపింది. చార్లెస్ ఆత్మహత్యతో ఐఐటీ ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే అతని ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
previous post