ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అహియాపూర్లోని ఓ స్కూల్ ప్రాంగణంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి హత్యకు గురయ్యాడు. సూరజ్కుమార్ అనే విద్యార్థి స్కూల్లో హత్యకు గురయ్యాడని ముజఫర్పూర్ డీఎస్పీ ముకుల్ కుమార్ రంజన్ తెలిపారు.
అహియాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సూరజ్కుమార్ తల్లి పర్సును ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో ఆ మహిళ సదరు వ్యక్తిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తి సదరు మహిళపై కక్ష పెంచుకుని ఆమె కుమారుడిని స్కూల్ ప్రాంగణంలో హత్య చేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కూడా ఈ హత్య వెనుక ఉన్నట్లు భావిస్తున్నామని, అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.