telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళ్ళి .. డిగ్రీ విద్యార్థిని అదృశ్యం!

New couples attack SR Nagar

సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని కాలేజీకి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చప్పల్ బజార్‌కు చెందిన కీర్తన (22) మాసబ్‌ట్యాంక్‌ జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని బుధవారం కళాశాలకు వెళ్లింది.

సాయంత్రమైనా కీర్తన తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి సతీశ్ యాదవ్ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీర్తన కోసం గాలిస్తున్నారు. కాగా, తాను జీవితంలో స్థిరపడిన తర్వాత మళ్లీ కలుస్తానంటూ కీర్తన తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సందేశాలు పంపినట్టు పోలీసులు తెలిపారు.

Related posts