telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

New couples attack SR Nagar

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరికి విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఐదో తరగతి చదువుతున్న అయాన్ ఖాన్(11) అనే విద్యార్థి పాఠశాల మైదానంలో ఆడుకుంటున్న సమయంలో చెట్టుకు కట్టిన విద్యుత్ తీగను పట్టుకోగా షాక్ కు గురై మరణించాడు. తోటి విద్యార్థులు ఇది గమనించి ఉపాధ్యాయులకు తెలిపారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరివల్లే తమ కుమారుడు మృతి చెందాడని విద్యార్థి తల్లిడండ్రులు అవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, బాలుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Related posts