telugu navyamedia
ట్రెండింగ్

సికింద్రాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో పరీక్ష హాల్ లోనే .. కుప్పకూలిన విద్యార్థి .. మృతి.. !

student died in exam hall

విద్యాసంవత్సరం ముగుస్తుండటంతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, తెలంగాణలో ఇంటర్ పరీక్షల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద శ్రీ చైతన్య కళాశాలలో పరీక్షలు రాస్తున్న గోపీరాజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనితో పరీక్షా కేంద్రం నిర్వాహకులు పిల్లాడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. గోపీరాజ్ మార్గమధ్యంలోనే చనిపోయాడని తెలిపారు.

ఎల్లారెడ్డిగూడ ప్రభుత్వ కళాశాలలో గోపీరాజ్‌ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా గోపీరాజు స్వస్థలమని వెల్లడించారు. గోపీరాజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి, సోదరుడు ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Related posts