telugu navyamedia
తెలంగాణ వార్తలు సామాజిక

పాఠశాల సంపులో పడి విద్యార్థి మృతి

minor girl abused by tech students
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న అశ్విన్‌ (14) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు పాఠశాలలోని నీటి సంపులో పడి మృతి చెందాడు.  వెంటనే విద్యార్థిని సంపు నుంచి బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి కుటుంబీకులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Related posts