telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

మందలించిన టీచర్ పై విద్యార్థి కక్ష..అర్ధరాత్రి కత్తితో దాడి

తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు తనను తరచుగా మండలిస్తున్నాడని ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై కక్ష పెంచుకున్నాడు. పగతో రగిలిపోయి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురిలో తరచూ మందలిస్తుండడంతో ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై విన్సెంట్‌ అనే విద్యార్థి కక్ష పెంచుకున్నాడు.

సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక కత్తితో ఆయనపై దాడిచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, టీచర్ తనను రోజూ అందరి ముందు అవమానిస్తుండడంతో తట్టుకోలేకే దాడికి పాల్పడినట్టు నిందితుడు విన్సెంట్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts