telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈవీఎంలతో సెల్ఫీ.. టీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్!

evm security from insects precautions by ec

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఇష్టానుసారంగా ఫోటోలు తీయడం కొందరికి వ్యసనంగా మారింది. సమయం సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకొంటారు. పోలీసుల చేతిలో చిక్కుతూ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండే స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచిన చోట, టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సెల్ఫీ దిగి, వీడియో తీసుకున్నాడు. అవి బయటకు వచ్చి వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖరరెడ్డికి పోలింగ్ ఏజంట్ గా వ్యవహరించిన ఎన్ వెంకటేశ్ అనే వ్యక్తి, పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను హోలీ మేరే కాలేజ్ లో భద్రపరుస్తున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఫోటోలు దిగి, వీడియో తీసుకున్నాడు. చట్టవిరుద్ధంగా స్ట్రాంగ్ రూములో వీడియో, ఫోటోలు తీశారని కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

Related posts