telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శ్రీ వారి.. ఏడుకొండలకు ఆ పేరు ఎలా వచ్చింది!

Tirumala

తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు.

వెంకన్న కొలువై వున్నా ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు )మాత్రమె కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి. అవి 

1. వృషభాద్రి ; 

పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు “తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది “అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది .

2. నీలాధ్రి ;

స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొనదలలో ఒక కొండ కి ఆమె పేరుగా పేరుని పెట్టారు .

3. గరుడాద్రి;

శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినందువల్లె అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది .

4. అంజనాద్రి ; 

సంతానం కోసం అంజనా దేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . తానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి,చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది .

5. నారాయణాద్రి ; 

నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది .

6. వేంకటాద్రి ; 

వేం అనగా సమస్త పాపాలనుకటః అనగా దహించునది అంటే పాప రాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది .

7. శేషాద్రి ; 

ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . “నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు “అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా భాదతో వున్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,”నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది .

ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు .

 

 

Related posts