telugu navyamedia
ఆరోగ్యం

పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు ?

Spinach

ఆకుకూరను కట్‌చేసి, 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచాలి. ఆ తర్వాత మంచినీటిలో మూడుసార్లు కడగాలి. దీని వల్ల ఆకు కూరలపై ఉన్న రసాయన అవశేషాలన్నీ తొలగిపోతాయి. ఆకుకూరలో ఉన్న నీటితోనే కూర మగ్గుతుంది. ఇలా ఉడికిన కూరను డైరెక్ట్‌గా తినొచ్చు. పప్పులో తాళింపు వేసుకోవచ్చు. ఇతర కూరగాయలు, మాంసాహారంతో కూడా కలిపి వండుకోచ్చు. ఇలా వండుకున్న ఆకుకూరల్లో అన్ని పోషకాలు ఉంటాయి. ఉడికించి నీళ్లు పారబోస్తే చాలా విటమిన్లు పోతాయి.
ఇక పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా ? అంటే పాలకూర తింటే రాళ్లు రావు. కానీ రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్‌ వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకోనివారు, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో నీటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

Related posts