స్టాండప్ కమెడియన్ మంజునాథ్ నాయుడు (36), భారత సంతతికి చెందిన వాడు, దుబాయ్లో మృతిచెందారు. లక్షలాది మంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శన ఇస్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే ఆయన కుప్పకూలిపోయారు. అయితే ప్రేక్షకులు మాత్రం ప్రదర్శనలో భాగంగానే ఆయన పడిపోయారని అనుకోవడం గమనార్హం.
ఎంతకీ ఆయన లేవకపోవడంతో షో నిర్వాహకులు వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యలు వెల్లడించారు. మంజునాథ్ అబుదాబిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్కు చెందినవారు. తల్లిదండ్రులు చనిపోవడంతో సోదరుడితో కలిసి మంజునాథ్ దుబాయ్కు వెళ్లిపోయారు. స్టాండప్ కమెడియన్గా పలు ప్రదర్శనలు చేస్తూ జీవనం సాగించేవారు.
అందాలు ఆరబోస్తే తప్పేంటి ? : హీరోయిన్