telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా వరికూటి సూర్యకిరణ్

varikuti

ఏపీ ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్ సభ్యులను నియమించింది. విశాఖపట్నం, మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా వరికూటి సూర్యకిరణ్ కుమార్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. సూర్యకిరణ్ గత కొంతకాలంగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.

ఉస్మానియా యూనివర్సీటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైన వరికూటి 2004 నుంచి 2014 వరకు దేవాదయ, వ్యవసాయ శాఖలకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించడంతో అభినందనలు వెల్లు విరుస్తున్నాయి.

నవ్య మీడియా తరపున కూడా వరికూటి సూర్యకిరణ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. 

Related posts