telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అభినందన సభలో కూలిన వేదిక.. మంత్రి పుష్పవాణి క్షేమం

pushpa sreevani

విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పవాణికి అభినందన సభ ఏర్పాటు చేస్శారు. అకస్మాత్తుగా సభా వేదిక కుప్ప కూలింది. ఈ ఘటనలో మంత్రి పుష్పవాణికి పెద్ద ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పుష్పవాణికి భోగాపురం నేతలు రాజాపులోవ జంక్షన్ లో ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ సభకు హాజరైన మంత్రి వేదికపైకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు కూడా వేదికపైకి రావడంతో అది కుప్పకూలింది. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆమెతోపాటు వేదికపై ఉన్న వారికి కూడా ప్రమాదం తప్పింది.

Related posts