టాలీవుడ్లో వివాదాలకు కారణమై ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ముఖ్యంగా ఫేస్బుక్లో గంటగంటకు పోస్టులు పెడుతూ టాలీవుడ్ ప్రముఖులపై కూడా సెటైర్లు, విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల కాలంలో శ్రీరెడ్డిలో చాలా మార్పు కన్పిస్తోంది. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్గా బూతుల దండకం అందుకునే శ్రీరెడ్డి పశ్చాత్తాప పడుతోంది. అసలు విషయమేమిటంటే… గతంలో తమిళ నటులు రాధికా శరత్ కుమార్లపై సంచలన కామెంట్స్తో వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డి.. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. “రాధికా శరత్ కుమార్ గారు.. చాలా కారణాలతో మిమ్మల్ని ద్వేషించాను.. ఇప్పుడు నా తల మీ పాదాల దగ్గర పెడుతున్నా” అంటూ తన ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. గతంలో ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్పై కూడా సెక్సువల్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఆ తరువాత రియలైజ్ అయ్యింది. శ్రీరెడ్డిలో ఇలా అకస్మాత్తుగా మార్పు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మార్పుకు కారణమేంటో…!!?
మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్