telugu navyamedia
సినిమా వార్తలు

పిట్టకథలు చెప్తోన్న శ్రీరెడ్డి… ఎందుకంటే…?

Srireddy

నటి శ్రీరెడ్డి లైంగిక ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అవకాశం ఆశతో తనను వాడుకున్నారంటూ హైదరాబాదులో ఆందోళనకు దిగి రచ్చ చేసిన ఈ నటి ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, నటుడు లారెన్స్‌ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి రచ్చ చేసింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల మళ్ళీ వార్తల్లో నానుతోంది. అయితే తాజాగా శ్రీరెడ్డి మల్లాది తాజాగా బిగ్ బాస్ 3కి ఎంపికైనట్టు తెలిసిన విషయమే. కానీ గత రెండు రోజులు గా శ్రీరెడ్డి చిన్న పిల్లల కథలు చూసుకుంటూ టాలీవుడ్ లో చాలామంది ని ట్యాగ్ చేయడం మొదలుపెట్టింది.

అడివి లో రాజు సింహం కథని చూసి దాని యూట్యూబ్ లింక్ షేర్ చేసి “టాలీవుడ్ ఇండస్ట్రీ కి రాజు ఎన్టీఆర్ అని ‘జై ఎన్టీఆర్” అని వాఖ్య లు చేసింది. అలాగే శ్రీరెడ్డి “నేను దయ్యం కథలు చూసి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక నాగార్జున గారికి ఈ కథ చెప్తాను దెబ్బకు భయపడి పారిపోతారు అప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారు ఎలా ఉందిరా ఐడియా?” అని అడిగింది. ఇంకొక కథను దురాశ దుఃఖాన్ని చేటు అనే కథను ఉన్నదానితో సరిపెట్టుకోవా లని లేదంటే దురాశకు పోతే నాగబాబు గారు లాగా తయారవుతారు అని చెప్పి ట్యాగ్ చేసింది. ఇక ఈ కాంట్రవర్సి బ్యూటీ బిగ్ బాస్ లో ఏ=ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.

Related posts