telugu navyamedia
సినిమా వార్తలు

మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

Srireddy Post

ఈమధ్య తమిళంలో సినిమా ఆఫర్లు రావడంతో చెన్నైకి వెళ్ళిపోయిన శ్రీరెడ్డి కొన్నిరోజులు సంచలనాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలను మొదలు పెట్టేసింది. కొరటాల శివపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసింది. హీరోయిన్ త్రిషని రానా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను, తనను అభిరామ్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను కలిపి పోస్ట్ చేస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తాన్ని విమర్శించింది.

”పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా ? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. వీటన్నింటికీ అడ్డా రామానాయుడు స్టుడియోస్” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం శ్రీరెడ్డికి రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు సరే… నీకేమైంది మీ అమ్మానాన్న కూడా నిన్ను ఇలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటూ వదిలారా ? అని ప్రశ్నిస్తున్నారు.

Related posts