telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరిటాల సునీత స్థానంలో..కుమారుడు శ్రీరామ్ పోటీ

Sriram to contest from Raptahdu

ఈ సారి ఎన్నికల్లో మంత్రి పరిటాల సునీత దూరంగా ఉంటున్నారు. ఆమె స్థానంలో కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. రాప్తాడు అసెంబ్లీ నుంచి శ్రీరామ్ పోటీ చేయనున్నారు. అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ ను బరిలోకి దింపుతున్నట్టు సునీత స్వయంగా తెలిపారు. తాము రెండు సీట్లు అడుగుతున్నామని, అందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించకపోవడంతో తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆమె తెలిపారు.

అనంతపురం జిల్లాలో రాజాకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. సిట్టింగ్ నేతలు వారి తనయులను ఎన్నికల బరిలో దింపుతున్నారు. పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ రెడ్డిని పోటీకి దించతుండగా, తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని పోటీకి దింపుతున్నారు. ఇప్పుడు తాజాగా పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్ రంగంలోకి దిగుతున్నారు

Related posts