telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. ఆతిధ్య జట్టు పకడ్బందీ ఫీల్డింగ్..

srilanka hardships in world cup match

నేడు ప్రపంచ కప్ లో భాగంగా ఆతిథ్య జట్టుతో శ్రీలంక పోటీపడుతోంది. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక కష్టాల్లో పడింది అనే చెప్పాలి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కేవలం 3 పరుగులకే ఓపెనర్లు అవుట్ కాగా, మిడిలార్డర్ లో ఫెర్నాండో (49), మెండిస్ (46)ల పోరాటం కాసేపే అయింది. పరిస్థితి నిలకడగా ఉందన్న తరుణంలో వీరిద్దరూ వెనుదిరగడంతో లంక భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది.

38 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలో మాథ్యూస్ 40, డిసిల్వా 20 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లెగ్ స్పిన్ అదిల్ రషీద్ 2 వికెట్లు తీశాడు. వోక్స్, ఆర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ సాధించారు.

Related posts