telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీలంక మృతుల్లో 8 మంది భారతీయులు: సుష్మ

serial bomb blasts in srilanka capital 42 died

శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 8 మంది భారతీయులు మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్రదాడుల్లో హెచ్ శివకుమార్ అనే మరో వ్యక్తి‌ కూడా మరణించడంతో మృత్యువాతపడిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు శ్రీలంక విదేశాంగ శాఖ ధ్రువీకరించిందని ఓ ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు.

మృతులను వేమూరి తులసీరామ్, ఎస్ఆర్ నాగరాజ్, కె.జి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, లక్ష్మి, నారాయణ చంద్రశేఖర్, రమేష్‌లుగా గుర్తించారు.కాగా, లంక పేలుళ్ల మృతులలో కేరళవాసి పీఎస్ రసీనా ఉన్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదివారం ప్రకటించినప్పటికీ, లంక అధికారులు ఇంకా ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఎన్‌టీజేకి చెందిన ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు శ్రీలంకలో ఈ బీభత్సానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

Related posts