శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 8 మంది భారతీయులు మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం సేద తీరేందుకు స్నేహితులతో కలసి అమర్ నాథ్ శ్రీలంకకు వెళ్లారు.
అమర్ నాథ్ బస చేసిన కింగ్స్ జ్యూరీ హోటల్ కు అత్యంత సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్రమత్తమైన అమర్, అతని స్నేహితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సురక్షితంగా ఎమ్మెల్యే అమర నాథ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను కాపాడిందని చెప్పారు.
సచివాలయ వ్యవస్థ వల్లే అనేక సమస్యలు: పురందేశ్వరి