telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నర్తనశాల నుంచి శ్రీహరి లుక్ రిలీజ్..

నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన తండ్రి నటశిఖరం ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమాను బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అర్జునిడిగా బాలయ్య నటించగా, భీముడిగా శ్రీహరి , ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు. ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. ద్రౌపతి పాత్రలో సౌందర్యను తప్ప మరో హీరోయిన్ ను ఉహించుకోలేమని బాలయ్య ఏకంగా ఆ సినిమాను పక్కన పెట్టేసారు. హీరోయిన్ అకాల మరణం కారణంగా తన కలను కూడా పక్కన పెట్టేసాడు బాలకృష్ణ. అయితే ఈసినిమా 17 నిమిషాలు చిత్రీకరించారు. అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు బాలయ్య. విజయదశమి కానుకగా ఎన్బీకే థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయనున్నారు. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలు చూడలనుకుంటున్న మీ కోరిక ఈ నెల 24న నెరవేరబోతోంది. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ లో బాలయ్య ఆశ్చర్య పరిచారు. ఇవాళ మరో లుక్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో భీముడి పాత్ర ధరి శ్రీహరి లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ విడుదల సందర్బంగా శ్రీహరి తనయుడు మేఘాంశ్ స్పందించాడు. ఈ సందర్బంగా చాలా ఏళ్ళ తర్వాత తన తండ్రి నటించిన సినిమాను చూడబోతున్నందుకు బాలయ్యతో పాటు శ్రేయాస్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts