telugu navyamedia
సినిమా వార్తలు

హీరోగా శ్రీహరి తనయుడి ఎంట్రీ

Srihari-Son

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విలన్ గా, హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహ‌రి 2013లో అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించడం అభిమానులను కలచి వేసింది. తాజాగా శ్రీహ‌రి పెద్ద త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్నాడని తెలుస్తోంది. మేఘాంశ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా భైర‌వ అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఇందులో శ్రీహ‌రి హీరోగా న‌టించారు. తండ్రి మరణం, చదువు కారణంగా కొంత కాలం సినిమాల‌కి దూరంగా ఉన్న మేఘాంశ్ త్వ‌రలో “రాజ్‌దూత్” అనే సినిమాతో వెండితెర‌కి ప‌రిచ‌యం కానున్న‌ట్టు సమాచారం. కొన్నాళ్ళ పాటు న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. కార్తీక్ – అర్జున్ ద‌ర్శ‌క ద్వ‌యంలో రాజ్‌దూత్ అనే చిత్రం రూపొంద‌నుంది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. రొమాంటిక్ యూత్‌ఫుల్‌ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట. మరి మేఘాంశ్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Related posts