తెలుగు అతిలోక సుందరిగా ఎందరి మనసులనో దోచుకున్న నటి శ్రీదేవి మరణించి అప్పుడే ఏడాది అవుతుంది. ఆమె తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో అనేక చిత్రాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. శ్రీదేవి నెంబర్ వన్ కథానాయికగా ఒక వెలుగు వెలిగారు. దేశ వ్యాప్తంగా లక్షలమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి శ్రీదేవి క్రితం ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్ లోని ఒక హోటల్లో హఠాత్తుగా చనిపోయారు. ఆమె మరణ వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేనివాళ్లు ఎంతో మంది వున్నారు.
శ్రీదేవి ప్రథమ వర్ధంతిని జరపడానికి ఆమె కుటుంబం సిద్ధం అవుతుంది. ఆమెకు ఎంతగానో ఇష్టమైన చెన్నై నగరం పట్ల .. అక్కడి తన ఇల్లు పట్ల ప్రేమ ఎక్కువట. అందువలన అక్కడే ఆమె ప్రథమ వర్ధంతిని జరపాలని వాళ్లు నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
నెపోటిజం అంటూ సూర్య, విజయ్ పై మీరా మిథున్ తీవ్ర వ్యాఖ్యలు…!