telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానల్… రచ్చ మొదలైంది

Srireddy

శ్రీరెడ్డి ఈమధ్య తమిళంలో సినిమా ఆఫర్లు రావడంతో చెన్నైకి వెళ్ళిపోయిన శ్రీరెడ్డి కొన్నిరోజులు సంచలనాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలను మొదలు పెట్టేసింది. కొరటాల శివ, దగ్గుబాటి ఫ్యామిలీని, నానిని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పటివరకు ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద అంశాలకు అడ్రస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది.

ఇప్పుడు యూట్యూబ్ ద్వారా “మా” ఎన్నికలపై, తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసింది. “మీరే పెడతారా ఛానెల్… మేము కూడా పెడతాం… “అంటూ మొదలుపెట్టింది శ్రీరెడ్డి. ఇటీవల నాగబాబు టీడీపీ అధికార ప్రతినిధి యామిని గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నాగబాబుకు ఇంత వయసు వచ్చినా సిగ్గు, బుద్ది అబ్బలేదని ఫైర్ అయ్యింది. మీరు ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతుందా…? సాధినేని యామినిపై దారుణంగా ట్రోల్ చేసే వారిని వెనకేసుకొస్తున్నారు… ఇదే పరిస్థితి మీ అమ్మాయికి వస్తే ఇలాగే స్పందిస్తారా…? అంటూ ప్రశ్నించింది. అంతేకాదు ”ఇదేమైన “జబర్దస్త్” అనుకుంటున్నావా? జబర్దస్త్ లేకపోతే అసలు నాగబాబు ఎవడు? చిరంజీవి తమ్ముడు లేదంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య… నీకంటూ సొంతంగా ఒక గుర్తింపు లేదు… ఒక స్థాయి లేదు” అంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది

Related posts