శబరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం రాత్రి మరో మహిళ ప్రవేశించారు. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ పవిత్ర పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోకి చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ.. గురువారం రాత్రి 10:55 గంటల సమయంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్లు పోలీసులు ధృవీకరించారు. కోజికోడ్ కు చెందిన బిందు(42), కనకదుర్గ(44)లు కలిసి బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నప్పటికీ పదునెట్టాంబడి మాత్రం ఎక్కలేదు. వీరిద్దరూ అయ్యప్ప మాల ధరించినప్పటికీ సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకున్నారు.
శశికళ మాత్రం పడి మెట్లు మీదుగా ఆలయంలోకి వెళ్లడం గమనార్హం. గురువారం సాయంత్రం పంబా బేస్ క్యాంప్ కు చేరుకున్న శశికళకు డీఎస్పీ కేడర్ అధికారి ఆధ్వర్యంలో రెండు బృందాలు భద్రత కల్పించాయి. అయితే శశికళ దర్శనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దర్శనం చేసుకున్నట్లు కేరళ సీఎంవో వర్గాలు నిర్ధారించగా, దర్శనం చేసుకోలేదని శశికళతో పాటు ఆమె భర్త పేర్కొన్నారు.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి