కొలంబోలోని లగ్జరీ హోటల్ సినమన్ గ్రాండ్ హోటల్ లో ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా చేతితో ప్లేట్ పట్టుకు, నిభుజానికి బ్యాగ్ తగిలించుకుని మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. ప్లేట్లో అల్పాహారం వడ్డిస్తుండగానే ఒక్కసారిగా అజాం మహమ్మద్ అనే వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది.
ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణం నెలకొంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్రేక్ఫాస్ట్కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.