సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అలవోక విజయాన్ని సాధించింది. హైదరాబాద్కు ఇది వరుసగా మూడో విజయం కాగా, ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఓటమి. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. మంచి రన్రేట్ కారణంగా హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 14 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఓపెనర్ పృథ్వీషా (11) బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత కూడా ఢిల్లీ వికెట్ల పతనం కొనసాగింది.
హైదరాబాద్ బౌలర్ల పదునైన బంతులకు బ్యాట్స్మెన్ ఎదురు నిలవలేకపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఎదురొడ్డి నిలిచాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్తో 43 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ 13 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 129 పరుగులు చేసి హైదరాబాద్ ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ బెయిర్స్టో 28 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో 48 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ను గెలిపించిన అతడికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్ : బెంగళూరు vs కోల్కతా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.