హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. 14రీల్స్ పతాకంపై రాం అచంట, గోపీ అచంట నిర్మిస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇలా ఉండగా.. ఈ సినిమా నుండి టైటిల్ పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాటను లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ను ప్రిన్స్ మహేష్ బాబు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ అలాగే మొదటి రెండు పాటలు మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈ టైటిల్ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొత్తం వ్యవసాయం బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పూర్తిగా ఈ మూవీ గ్రామీణ ప్రాంతలోనే తీసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.
previous post
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు