శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రంలో నటిస్తున్నాడు పల్లెటూరి నేపథ్యంలో కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మహాశివరాత్రి కనునగా ఫిబ్రవరి 11న విడుదల కానున్నట్లు ప్రకటించారు. అయితే శర్వానంద్ ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే పేరు పెట్టారు. మరో సినిమా తెలుగు-తమిళ భాషలో ఒకే సమయం లో చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ అనే ఒక నూతన దర్శకుడు చెప్పిన ఒక వికలాంగుడి కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. ఇరాక్ ఈ మధ్య కాలంలో శర్వానంద్ సరైన విజయం అందుకోలేకపోయారు. ‘శతమానం భవతి’ సినిమా తరవాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘రాధ’ డిజాస్టర్ తరవాత ‘మహానుభావుడు’ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వరుసగా ‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ సినిమాలు నిరాశపరిచాయి. మరి శ్రీకారం సినిమా శర్వానంద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
previous post