సాహో చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సాహో చిత్రం బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుండగా, ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో సీన్స్ ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. ఓ యాక్షన్ సీన్లో ప్రభాస్, శ్రద్ధాలు కలిసి కనిపించడంతో వీరిద్దరి పాత్రలపై అభిమానులలో అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా శ్రద్ధా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి చిన్న పాటి క్లారిటీ ఇచ్చింది.
పోలీసులు దేశం కోసం ఎంతో సేవ చేస్తారు. అలాంటి పాత్ర సాహోలో తనకి దక్కినందుకు గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అంటే శ్రద్ధా మాటలని బట్టి చూస్తుంటే ఆమె సాహోలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ స్పైగా కనిపిస్తాడని టాక్. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే బిజినెస్ జరుగుతుండగా, ఈ చిత్రం గత రికార్డులని తిరగరాయడం ఖాయమని అంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే
నన్నో క్రిమినల్ లా చూశారు… గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కెనడియన్ ఫిలింమేకర్ ఫైర్